పార్వతీపురం మండలంలోని అనేక గ్రామాలలో ఆదివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం కురిసిన వర్షంతో ప్రజలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో వాహన చోదకులు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.