ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, అవి నిర్ణీత సమయంలో బయలుదేరకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మన్యం జిల్లా పార్వతీపురం- హైదరాబాద్ 07465 స్పెషల్ రైలు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలు ఆలస్యంగా దువ్వాడకు చేరుకుంది. దీంతో రైల్లో ప్రయాణికులు కనిపించలేదు, రైలు ఖాళీగా తన గమ్యస్థానానికి వెళుతోంది.