సాలూరు మండలం లొద్ద జలపాతం ప్రారంభం ఏర్పాట్లను పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. కాగా ఇప్పటికే జలపాతం వద్ద ఆర్చితో పాటు రహదారి, పర్యాటకులు సేద తీరడానికి విశ్రాంత బల్లలు, డ్రస్ చేంజింగ్ రూమ్స్, దుకాణాలను సిద్ధం చేశారు. సౌకర్యాలు సమకూర్చడంలో ఎటువంటి లోపాలు ఉండరాదని అధికారులకు సూచించారు.