వీరఘట్టం మండలం పాలమెట్టలో ఇవాళ కార్బన్ డయాక్సైడ్ వ్యర్థాలను తగ్గించే రోజు సందర్భంగా యం.పి.యు.పి. స్కూల్ విద్యార్థులు CO2 ఆకృతి ప్రదర్శనతో అబ్బురపరిచారు. ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు, గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.