విజయనగరం: రెండు చోట్ల పిడుగుల బీభత్సం

5చూసినవారు
విజయనగరం: రెండు చోట్ల పిడుగుల బీభత్సం
విజయనగర జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో తెర్లాం(మ) నందబలగలో పడిన పిడుగులకు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రాజాం (మ) కంచరాంలో ఒక తాటి చెట్టు కూడా పిడుగుపాటుకు దగ్ధమైంది. జనావాసాల సమీపంలో భారీ శబ్దాలతో పిడుగులు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్