పాస్‌పోర్ట్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఈ నెల 15 నుంచే అమలు

3043చూసినవారు
పాస్‌పోర్ట్ నిబంధనల్లో భారీ మార్పులు.. ఈ నెల 15 నుంచే అమలు
భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను సరళీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను పటిష్టం చేస్తూ, సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రూపొందించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుండి అమల్లోకి రానున్నాయి. ఆధార్ కార్డుతో పాటు డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. పోలీసు ధృవీకరణ ప్రక్రియను డిజిటల్ విధానంలో కొద్ది రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. అత్యవసర కేసుల్లో 'పోస్ట్-ఇష్యూ వెరిఫికేషన్' సౌకర్యం కల్పించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తుదారులు స్వయంగా ఫారమ్‌లు నింపడం, స్లాట్‌లు బుక్ చేసుకోవడం వంటి పనులు సులభతరం అవుతాయి. తప్పుడు పత్రాలు సమర్పిస్తే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని అధికారులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల వారికి మరిన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్