AP: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే అటవీశాఖ వినియోగానికి వాహనాలు, అంబులెన్సులను ఫౌండేషన్ ద్వారా అందజేశారు.