AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సోమవారం జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృ కర్మ పూజలు ఉండటంతో.. ఆయన సదస్సుకు హాజరుకాలేకపోయారు. పితృ కర్మ పూజలో పవన్ పాల్గొంటారని ఆయన పీఆర్వో చెప్పారు. మంగళవారం జరిగే కలెక్టర్ల సదస్సులో పవన్ పాల్గొంటారని పేర్కొన్నారు.