AP: సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల చాలా మంది పింఛన్దారులకు పెన్షన్ అందలేదు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కూడా పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయింది. కృష్ణా జిల్లాలో 95 శాతం,
ఎన్టీఆర్ జిల్లాలో 90 శాతం వరకు పంపిణీ చేశారు. వీటితోపాటు ఇతర జిల్లాల్లోనూ రేపు పింఛన్ అందజేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల సుమారు 64 లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు.