AP: కొత్త పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైసీపీ హయాంలో అర్హులైన 3 లక్షల మంది టీడీపీ కార్యకర్తలకు పింఛన్లు తొలగించిన విషయం తెలిసిందే. వచ్చే 3 నెలల్లో వారందరికీ పింఛన్లు అందించనున్నట్లు సమాచారం. కాగా, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. కేటగిరీల వారీగా నెలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలు ఇస్తోంది.