AP: పోలీసు అధికారులమని నటిస్తూ, సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనిని 'డిజిటల్ అరెస్ట్' మోసంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు అవగాహన కల్పించే వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన షేర్ చేశారు.