AP: రాజధాని అమరావతికి తాగునీటి సరఫరా కోసం 43, 44 ప్యాకేజీల పనులకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ప్యాకేజీ 43 పనులు రూ.494.86 కోట్లతో, ప్యాకేజీ 44 పనులు రూ.560.57 కోట్లతో చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులలో ఇన్టేక్ వెల్, అప్రోచ్ బ్రిడ్జి, రా వాటర్ పంపింగ్ మెయిన్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ రిజర్వాయర్, క్లియర్ వాటర్ పంప్ హౌస్ నిర్మాణం, స్కాడా, ఏఐ ఆధారిత సెంట్రలైజ్డ్ వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు.