బెంగళూరులో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళపై పెంపుడు కుక్క దాడి

4530చూసినవారు
బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో జనవరి 26న ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన మహిళపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఈ దాడిలో మహిళ మెడ, ముఖం, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి, 50కి పైగా కుట్లు పడ్డాయి. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన వారిపై కూడా కుక్క దాడి చేసింది. బాధితురాలి భర్త కుక్క యజమాని నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్