AP: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలు తెలిపారు. వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. తిరుపతిలో ఎడ్ల బండితో నిరసన తెలిపిన వైసీపీ నాయకులు, బంకులతో కూటమి నేతలు లాలూచి పడ్డారని ఆరోపించారు.