AP: సెప్టెంబర్ 29 నుండి సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, రాష్ట్రంలో పీజీ కోర్సులు చేయాలనుకునే పీహెచ్సీ వైద్యులకు రిజర్వేషన్ల పెంపు, గిరిజన భత్యాలు, కాలపరిమితి ప్రమోషన్లు వంటి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.