రాజస్థాన్లోని జైపూర్లో రష్యన్ ఫోటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు గులాబీ రంగు వేసి చేసిన ఫోటోషూట్ తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షూట్లో పాల్గొన్న 70 ఏళ్ల ఏనుగు 'చంచల్' గత నెలలో మరణించినప్పటికీ, దాని మరణానికి షూట్కు సంబంధం లేదని అధికారులు ధృవీకరించారు. హోలీలో వాడే ఆర్గానిక్ గులాల్ను మాత్రమే వాడి, వెంటనే కడిగేసినట్లు ఫోటోగ్రాఫర్, ఏనుగు యజమాని తెలిపారు.