మేడారం జాతరలో పోలీసుల ఓవరాక్షన్ చోటుచేసుకుంది. భక్తులు పోటెత్తడంతో, సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద కొందరు భక్తులను నేరస్తుల్లాగా ఈడ్చుకెళ్లి, లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరుపై మండిపడిన భక్తులు, ఆలయం వద్ద ఆందోళనకు దిగి, నినాదాలు చేశారు.