AP: విజయవాడలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రూట్ మ్యాప్ మార్చాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.