AP: సుగాలి ప్రీతి కేసుకు తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆమె తల్లి పార్వతి చేపట్టిన వీల్ఛైర్ యాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సుగాలి ప్రీతి బంధువులతో వాగ్వాదం జరిగింది. దాంతో కర్నూలులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలనే డిమాండ్తో ఆమె తల్లి పార్వతి చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు.