దేశ రాజధాని ఢిల్లీలో
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'కనిపించడం లేదు' అంటూ ఆదివారం వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఫిరోజ్షా రోడ్డుతో పాటు పలు కూడళ్లలో ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లను ఎవరు అంటించారనేది స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికల సమయంలో రాహుల్ దేశంలో ఉండరని
బీజేపీ విమర్శలు చేస్తున్న మరుసటి రోజే ఈ పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ పోస్టర్లు,
బీజేపీ ఆరోపణలపై
కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.