ప్రదీప్ రంగనాథన్ కొత్త ప్రయాణం.. నిర్మాతగా తొలి అడుగు

13495చూసినవారు
యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా మారి 'పిఆర్ షో' బ్యానర్‌పై కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, అశ్వత్ మరిముత్తు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'ది ఆల్ఫా యూనిట్' పేరుతో ఆరుగురు సభ్యుల బృందం దర్శకత్వం వహించనుంది, కథను ప్రదీప్ రంగనాథనే అందించారు. అనౌన్స్‌మెంట్ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్