ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో జరిగిన ఈ సోదాల్లో, మహేశ్వరరావు తన కుటుంబ సభ్యుల పేరిట 9 ఇంటి స్థలాలు, 2 ఫ్లాట్లు, వ్యవసాయ భూమిని కూడబెట్టినట్లు గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు.