మార్కాపురం జిల్లా గిద్దలూరులో గత ఐదు రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఆదివారం రాత్రి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షంతో ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. రానున్న రోజుల్లో కూడా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు.