మార్కాపురం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ ఈ విషయంపై ఫిర్యాదులు వచ్చినా, కాంట్రాక్టర్ను హెచ్చరించినా ఫలితం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఒంగోలుకు చెందిన ఏజెన్సీ వ్యక్తి స్థానిక వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లోపిస్తోందని, నాణ్యతలేని ఆహారంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.