కొమరోలు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. చింతలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నూతన విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.