ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గురువారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ ఘటనను గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మరణించిన జింకను వాహనంలో తరలించి దహన సంస్కారాలు నిర్వహిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతం నుండి జింక రహదారిపైకి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.