మార్కాపురం: తర్లుపాడు రోడ్లోని కరెంట్ ఆఫీస్లో బుధవారం ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తున్న ఎలక్ట్రీషియన్ భీమనబోయిన వెంకటేశ్వర్లు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ ఘటనతో ఆయన భార్య, కుమార్తె, కుమారుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.