జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో బుధవారం పోలీసులు మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలం సహాయంతో ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, ఎలాంటి నిషేధిత పదార్థాలు తరలించబడటం లేదని నిర్ధారించారు. ఈ తనిఖీలలో సీఐ సుబ్బారావుతో పాటు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.