ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్ -3 పరిధిలోని సౌత్ బైపాస్ రోడ్డు, సుజాతనగర్, సుబ్బయ్య కాలనీ, ముంగమూరు రోడ్డు జంక్షన్, 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, నేషనల్ టెస్టింగ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు టౌన్ డీఈఈ రంగారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.