ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు వద్ద మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి వ్యక్తికి గాయాలయ్యాయి. ఒంగోలు నగరానికి చెందిన పి. శ్రీనివాసరావు మేదరమెట్ల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టడంతో గాయపడిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.