పెద్దారవీడు మండలం గొబ్బూరులో శుక్రవారం రాత్రి రైతు చేకూరి కిట్టయ్య పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి, విలువైన కాపర్ వైర్ను దొంగిలించారు. విత్తనాల సీజన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సాగునీటి కోసం రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలను అరికట్టి, బాధితుడికి వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులు కోరారు.