ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు త్రిపురాంతకం పరిసర ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలను అరికట్టడం, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు 112 నంబర్ను వినియోగించి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.