జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పురోగతిని పరిశీలించేందుకు దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు. శ్రీశైలం ప్రాంతం నుంచి టన్నెల్లోకి ప్రవేశించి, దోర్నాల వైపుకు వస్తూ పనులను పరిశీలించారు. ఈ సాహసం ద్వారా ఆయన చరిత్ర సృష్టించారు.