
టీడీపీలోకి చేరిన వైసీపీ సర్పంచ్
ప్రకాశం జిల్లాలోని పెద్ద చెర్లోపల్లి గ్రామ వైసీపీ సర్పంచ్ తాళ్లూరి మరియమ్మ మంగళవారం కనిగిరిలో టీడీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.




































