ముండ్లమూరు పట్టణంలో గురువారం సీఐ రామారావు నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా దొంగతనాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.