ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామ సమీపంలో లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం ధ్వంసమైంది. అద్దంకికి చెందిన ఆర్టీసీ బస్సు పోదిలి నుంచి అద్దంకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.