ప్రకాశం జిల్లా కురిచేడులో వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు అందాల్సిన పెన్షన్లను అధికారులు ఇళ్ల వద్ద కాకుండా స్వర్ణ గ్రామం వద్ద పంపిణీ చేశారు. ఈ నిర్లక్ష్యంపై ఎంపీడీవో సత్య ప్రసాద్ స్పందించి, కార్యాలయాలకు పిలిచి పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు మెమో జారీ చేసి, వివరణ కోరాలని ఆయన ఆదేశించారు.