గిద్దలూరు నియోజకవర్గంలో శనివారం పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు పనితీరును ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రశంసించారు. తుఫాను సమయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడానికి కలెక్టర్ కృషి చేశారని, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ఇళ్లు, పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని తెలిపారు. అధికారులు తుఫాను సమయంలో బాగా కష్టపడ్డారని, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.