ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం కంభం మండలంలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం గిద్దలూరులో 41, కంభంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.