మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 27వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని తాతిరెడ్డి పల్లి గ్రామానికి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ, వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు గమనించి సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.