మంతా తుఫాను వల్ల అర్ధవీడు మండల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని స్థానిక వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన ఆయన, 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, వరద తగ్గేందుకు పది రోజులకు పైగా సమయం పట్టవచ్చని తెలిపారు. గతంలో సీఎం జగన్ సమయంలో నిర్మించిన రాస్తాను అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని సూచించారు.