ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో బుధవారం ఏబీఏం చర్చి సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ నడుపుతున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కంభం వాసులైన ప్రకాష్, మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డారు. వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.