మార్కాపురం జిల్లా కనిగిరిలో మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు రూ. 39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.