ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కనిగిరి కందుకూరు రహదారిలోని రామాపురం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మాలకొండయ్య అనే వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.