టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని మద్యం తాగుతున్న బహిరంగ ప్రదేశాలను పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలించి, ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేయించారు. మద్యం తాగుతున్న ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు.