కంభం మండలంలోని కందులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో SGSS షెడ్యూల్ ప్రకారం మంగళవారం వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను అభివృద్ధి చేయడంలో ఈ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.