ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నకిలీ మద్యం వ్యతిరేక పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శుక్రవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేశ్ పోలీస్ స్టేషన్లో 41ఏ నోటీసు అందుకున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరితే తప్పుడు కేసులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్దోషులపై చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.