ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై శనివారం ఎస్ఐ సుధీర్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఆయన సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన సంబంధిత ధ్రువపత్రాలు లేని వాహనదారులకు ఎస్ఐ జరిమానా విధించారు.