మంగళవారం మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.