మంగళవారం రాత్రి మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్ లో తిప్పిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలతో పాటు రూ. 25 వేల నగదును అపహరించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. బుధవారం ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు జరిగిన దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.